వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతలో 40 గంటలు రోడ్లు బంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురం జిల్లా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 40 గంటల రోడ్‌ బంద్‌ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్‌, సిపిఐలు జిల్లావ్యాప్తంగా రోడ్ల బంద్‌ కు పిలుపునిచ్చాయి.

అయితే మంగళవారం నాడు అనంతపురం జిల్లా అభివృద్ధికి చంద్రబాబు నాయుడు భారీ ప్యాకేజీ ప్రకటించారు. కేవలం ఉద్యమాన్ని నీరు కార్చేందుకే చంద్రబాబు ఈ ప్యాకేజీ ప్రకటించారని కాంగ్రెస్‌, సిపిఐనేతలు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ గురించి మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయించనట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. దీంతో రోడ్ల బంద్‌ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల సంఖ్య తక్కువగా వుంది.

అయినప్పటికీ కాంగ్రెస్‌, సిపిఎం నేతలు,కార్యకర్తలు జిల్లాలోని అన్ని రోడ్లను బంద్‌ చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా జిల్లా నుంచి వెళ్ళే వాహనాలన్నింటినీ ఇతర మార్గాల ద్వారా మళ్ళించినప్పటికీ కొన్ని వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసిస్వచ్ఛందంగా బస్‌ సర్వీసులను నిలిపివేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X