వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత రాస్తారోకో విజయవంతం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురం జిల్లాలోని కరవు పీడిత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, సిపిఎం తదితర విపక్షాల నేతృత్వంలో జరిగిన బంద్‌ రాస్తారోకో విజయవంతమైంది. కనీసం యాభై ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. బంద్‌, రాస్తారోకో సందర్భంగా పోలీసులు తీవ్రస్థాయిలో జులుం సాగించారని విపక్షనేతలు ఆరోపించారు.

మూడువేల మందిని అరెస్టు చేశారని వారు తెలిపారు. ఉదయం పదిగంటలకు రాస్తారోకోకు ప్రతిస్పందన అంతంత మాత్రంగానే కనిపించినప్పటికీ మధ్యాహ్నం సమయానికి పరిస్థితి హఠాత్తుగా మారిపోయింది. గ్రామాలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు కుటుంబాలతో సహా ఎడ్లబండ్లపై జాతీయ రహదారిపైకి, ఇతర ప్రధాన రహదారులపైకి చేరుకుని రాకపోకలను స్తంభింపజేశారు. బంద్‌, రాస్తోరోకోను 40 గంటల పాటు జరపాలని నిర్ణయించినప్పటికీ బుధవారం రాత్రి రైతులు పలువురు ఊళ్లకు తిరిగివెళ్లడం కార్యకర్తలు వేలసంఖ్యలో అరెస్టు కావడంలో రాత్రినుంచి వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా అనంత గుండా బెంగుళూరు వెళ్లే వాహనాలు ఎప్పటిలాగానే వెళ్లుతున్నాయి. అనంత ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్‌లో తొమ్మిది వామపక్షాలు ధర్నా జరిపాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X