మాజీ గవర్నర్‌ రఘునాథ రెడ్డి మృతి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల గవర్నర్‌గా పని చేసినకె.వి. రఘునాథ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఇక్కడి అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థలో మృతి చెందారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.

రఘునాథ రెడ్డి కొంత కాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లావీరుపూరు గ్రామంలో ఆయన 1924లో జన్మించారు. ఆయన 1962లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 11 ఏళ్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన త్రిపుర గవర్నర్‌గా పని చేశారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా 1998 వరకు పని చేశారు. బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల ఆర్థిక పథకం, తదితర కార్యక్రమాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. కృష్ణకాంత్‌, చంద్రశేఖర్‌, మోహన్‌ ధారియా, అమృత సహతలతో కలిసి కాంగ్రెస్‌ ఫోరం ఆఫ్‌ సోషలిస్టు యాక్షన్‌ను ఏర్పాటు చేశారు.

రఘునాథ రెడ్డి కొంత కాలం గుంటూరు, హైదరాబాద్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. ఆన రాసిన పుస్తకం క్రిమినల్‌ లా ఇప్పటికీ న్యాయ శాస్త్రవిద్యార్థులకు రిఫెరెన్స్‌ పుస్తకం. ఆయన డెమొక్రటిక్‌ సోషలిజం అనే మరో పుస్తకం కూడారాశారు. ఆయన మృతికి రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌, ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సి. రంగరాజన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+