వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుంధతికి సుప్రీంకోర్టు శిక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః నర్మదా బచావో ఆందోళన్‌ ఉద్యమనేత, ప్రముఖ రచయిత్రి అరుంధతిరాయ్‌కి కోర్టు ధిక్కారం కేసులో ఒకరోజు లాంఛనప్రాయ జైలు శిక్షను రెండు వేల రూపాయల జరిమానాను సుప్రీంకోర్టు విధించింది. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమె నేరపూరిత కోర్టు ధిక్కారానికి పాల్పడినట్టుగా న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌ పి పట్నాయక్‌, జస్టిస్‌ ఆర్‌పి సేథీలతో కూడిన డివిజన్‌ బెంచి పేర్కొంది. అఫిడవిట్‌లో ఆమెవ్యాఖ్యలు కోర్టు గౌరవానికి భంగం కలిగించేట్టుగా వున్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.జరిమానా చెల్లించడానికి యిష్టపడని పక్షంలో అరుంధతి మరో రెండు నెలల జైలు శిక్షను అనుభవించాల్సివుంటుంది. వాక్‌ స్వాతంత్ర్యం అంటే కోర్టులకు వ్యతిరేకంగా చిత్తవచ్చినట్టుగా వ్యాఖ్యానించడం కాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటి కోర్టుల గౌరవం సన్నగిల్లుతుందని వారు అన్నారు.

ఒకరోజు లాంఛనప్రాయ జైలు శిక్ష కోసం పోలీసులు ఆమెను తీహార్‌ జైలుకు తీసుకువెళ్లారు. జరిమానా చెల్లించేవిషయంలో కూడా తాను ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని అరుంధతి చెప్పారు. కోర్టు తీర్పు అఫిడవిట్‌లో తానుపేర్కొన్న విషయాలు సత్యమన్న విషయం మరోసారి రుజువు చేసినట్టుగా ఆమె చెప్పారు. నర్మదాడామ్‌ నిర్మాణానికి అనుకూలంగా కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నర్మదాబచావో ఆందోళన్‌ 2002 డిసెంబర్‌లో కోర్టు ముందు ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో కోర్టు ధిక్కారానికి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా మేధాపాట్కర్‌, అరుంధతిరాయ్‌పై కేసులు నమోదయ్యాయి. అఫిడవిట్‌ ఆధారంగా మేధాను కేసులోంచివిముక్తం చేయగా అరుంధతిపై మాత్రం అఫిడవిట్‌లోఅంశాలే కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వున్నాయని ఆరోపిస్తూ న్యాయమూర్తులో సుమోటో కేసు నమోదు చేసివిచారణ ప్రారంభించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X