వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలునుంచి అరుంధతి విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కోర్టు ధిక్కారం కేసులో సుప్రీం కోర్టు ఒక రోజు లాంఛనప్రాయమైన జైలు శిక్ష విధించిన ప్రముఖ రచయిత్రి, నర్మదాబచావో ఆందోళన్‌ కార్యకర్త అరుంధతీరాయ్‌ శుక్రవారం నాడు తీహార్‌ జైలునుంచి విడుదలయ్యారు.

కోర్టు విధించిన రెండు వేల రూపాయల జరిమానాను ఆమె చెల్లించారు. ముందుగా ఈ జరిమానా చెల్లించకుండా ఆమె మూడు నెలల జైలు శిక్షను అనుభవించడానికే సిద్ధపడుతారని భావించారు. అయితే జరిమానా చెల్లించాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా ఆమె తరఫున న్యాయవాది శాంతిభూషణ్‌ చెప్పారు.అరుంధతీ రాయ్‌కి శిక్ష విధించడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి నర్మదా బచావో ఆందోళన కార్యకర్తలు తీహార్‌ జైలు ముందు ధర్నా
జరుపుతున్నది. ఆందోళన్‌ నేత మేధా పాట్కర్‌ మరికొంత మంది నిరశన దీక్షలో కూచున్నారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఆందోళన్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గుజరాత్‌లో దారుణ మారణకాండను సృష్టించిన నరహంతకులు వీధుల్లోస్వేచ్ఛగా తిరుగుతుంటే రచయితలు, సామాజిక కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. తన నిర్బంధం దరిమిలా చేపట్టిన నిరశన దీక్షనువిరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X