జయేంద్ర ప్రయత్నాలకువిఘ్నం

న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి మూడు రోజుల పాటు రాజధానిలో వుండి ప్రయత్నాలు జరిపిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రయత్నాలకు అవరోధం కలిగింది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గంతో స్వామీజీ ప్రధాని వాజ్‌పేయితో విహెచ్‌పి నేతలతో ముస్లీం పర్సనల్‌ బోర్డు ప్రతినిధులతో చర్చలు జరిపారు.

వివాదారహిత ప్రదేశాన్ని విహెచ్‌పికిఅప్పగిస్తే వివాదాస్పద స్థలం విషయంలో కోర్టు తీర్పునకు కట్టుబడి వుంటామని తొలుత చెప్పిన విహెచ్‌పి హఠాత్తుగా కోర్టు తీర్పు వరకు వేచి వుంటామని తప్ప కోర్టు తీర్పుకు కట్టుబడి వుంటామని తాము చెప్పలేదని ప్రకటించింది. విహెచ్‌పి వైఖరితో కంగుతిన్ను ముస్లిం బోర్డు కూడా ముందుగా మార్చి 15 కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్‌ చేసింది. లేదంటే కోర్టుకు వెళ్లడమా లేదా మరో మార్గంలో విహెచ్‌పిని నిరోధించడమా ఆలోచిస్తామని ముస్లిం బోర్డు ప్రతినిధులు చెప్పారు. కథ మళ్లీ మొదటికి రావడంతో కంచిస్వామి ఈ ప్రయత్నాలను కట్టిపెట్టి గుజరాత్‌లో శాంతి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+