వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూషకేసులో మంత్రుల అబ్బాయిలు లేరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యుషకేసుపై గురువారం అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఈ కేసులో ఇద్దరు మంత్రుల కుమారులు వున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వార్తా పత్రికలు రాసిన వార్తలను ప్రతిపక్ష నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చదివివినిపించారు. ఈకేసులో పోలీసులు, కేర్‌ అధికారులు నిజాన్ని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్ని పార్టీలువిమర్శించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు జోక్యం చేసుకొని ప్రతిపక్షాలు ఈ కేసులో బాధ్యతారహతంగామాట్లాడుతు న్నాయన్నారు. ప్రత్యూష ప్రియుడు, ప్రస్తుతం కేర్‌ లో కోలుకుంటున్న సిద్దార్థరెడ్డి కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు మైసూరారెడ్డి మేనల్లుడని మొదట పుకార్లు పుట్టించారని, ఆ తరువాతవిచారణ జరిపిస్తే అతను మైసూరారెడ్డి బంధువు కాదని తేలిందన్నారు.

ఇక దేవేందర్‌ గౌడ్‌ కుమారునికి ఈ కేసుతో సంబంధం వున్నట్లు పుకార్లు వచ్చాయని అవి కూడా నిరాధారమైనవని చంద్రబాబు అన్నారు. దేవేందర్‌ గౌడ్‌ కుమారుల్లో ఒకరు అమెరికాలో వుండగా, మరొకరు పూనాలో వున్నారని చంద్రబాబువివరించారు. సున్నితమైన ఇటువంటి కేసుల్లో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. బిజెపి ఎమ్మెల్ల్యే కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసుతో ఎవరికీ సంబంధం లేకపోతే ఇంతకాలం ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కేర్‌ ఆస్పత్రి వారు బాధ్యతా యుతంగా వ్యవహరించలేదన్నారు. దోషులెవరూ తప్పించుకో కుండా ప్రభుత్వం ఇప్పటికైనా ప్రయత్నించాలన్నారు. ఈ కేసులో ఎవరినీ వదలం అని దేవేందర్‌ గౌడ్‌ ఆవేశంగా అన్నారు.అయినా ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో చివరకు ఈ కేసును సిబిఐకి నివేదించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X