వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపి, గుజరాత్పై పార్లమెంట్లో రభస
న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న ఆ రాష్ట్ర గవర్నర్ సిఫారసు, లక్నోలో ఎస్పి ఎమ్మెల్యే కాల్చివేత, గుజరాత్ మతకల్లోలాలపై గురువారం నాడు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ రెండు కీలక అంశాలపై సభలో చర్చ జరగాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. సభా కార్యక్రమాలు ముందుకుసాగకపోవడంతో డిప్యూటీ స్పీకర్ సయీద్ మొదట లోక్సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో సభను శుక్రవారానికి ఆయన వాయిదా వేశారు.
Comments
Story first published: Thursday, March 7, 2002, 23:53 [IST]