వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో ఆంక్షల ఎత్తివేత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో కరసేవకులు కదలికలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయడానికి కేంద్రం అంగీకరించింది. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించడానికి, కోర్టు తీర్పునకు కట్టుబడి వుండటానికి విహెచ్‌పి అంగీకరించిన విషయం విదితమే.

ప్రధాని నివాసంలో గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జరిగిన చర్చల్లో అయోధ్యలోనివివాదారహిత స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌ట్రస్ట్‌కు అప్పగించడానికి వీలుగా మూడు నెలల్లోగా తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని వాజ్‌పేయి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి కంచి శంకరాచార్య జయేంద్రసరస్వతి, బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి, విహెచ్‌పి నేతఅశోక్‌ సింఘాల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జాయింట్‌ సెక్రటరీ మదన్‌ దాస్‌ దేవి, రక్షణ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌, హోం మంత్రిఅద్వానీ హాజరయ్యారు. హోంశాఖ సహాయ మంత్రి ఐడిస్వామిని అయోధ్యకు పంపి అక్కడి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X