వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు వేల కోట్లతో రాష్ట్రానికి వెలుగు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండః రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆరు జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్న బృహత్‌ ప్రాజెక్టు వెలుగును రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారు. 600 కోట్లతో అమలు చేస్తున్న ఈ పేదరిక నిర్మూలన ప్రాజెక్టును రెండువేల కోట్లతో అన్ని జిల్లాలకు ఏప్రిల్‌కల్లా విస్తరించనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు.

దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు నల్గొండలో 12వ ఎపిఎస్‌పి బెటాలియన్‌ భవన సముదాయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా 604 గ్రామాలకు తాగునీరుఅందించే 147 కోట్ల రూపాయల నాబార్డ్‌ ప్రాజెక్టుకు నల్గొండ పట్టణానికి తాగునీరందించే 16 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. నల్గొండ క్లాక్‌ టవర్‌సెంటర్‌లో నెలకొల్పిన మాధవరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆగస్టు నుంచి 24 గంటలు కరెంట్‌ సప్లయ్‌ చేయనున్నట్టుగా వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X