వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ఆహ్వానానికి అద్వానీ తిరస్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్‌ః ఇస్లామాబాద్‌ రావల్సిందిగా పాకిస్తాన్‌ పంపిన ఆహ్వానాన్ని కేంద్ర హోం మంత్రి అద్వానీ సున్నితంగా తిరస్కరించారు. ఉభయదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపునకు ఇస్లామాబాద్‌ పర్యటించాల్సిందిగా ఆ దేశ ఆంతరంగిక భద్రతా వ్యవహారాల మంత్రి మొయినుద్దీన్‌ హైదర్‌ అద్వానీని ఆహ్వానించారు.

ప్రస్తుతం సార్క్‌ దేశాల సమాచార శాఖ మంత్రులు సమావేశం కోసం ఇస్లామాబాద్‌లో వున్న కేంద్ర సమాచార శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆహ్వానాన్ని అందజేశారు. పాక్‌తో చర్చల వల్ల ప్రయోజనం లేదని గత అనుభవాల ద్వారా ఇప్పటికే వెల్లడయిందని అద్వానీ అన్నారు. భారత్‌ కోరిన 20 మంది టెర్రరిస్టులను ముందుగా తమకుఅప్పగించాలని, టెర్రరిజం పై పోరులో పాకిస్తాన్‌ తన చిత్తశుద్దిని నిరూపించుకుంటే తప్ప ఆ దేశంతో చర్చలు జరపడం వల్ల ప్రయోజనం లేదని అద్వానీ అన్నారు. పాకిస్తాన్‌ తనను ఆహ్వానించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన వెల్లడించారు.పేపర్లో చూసిన తర్వాతే ఈ విషయం తనకు తెలిసిందని ఆయన వెల్లడించారు. తన జన్మస్థలం కరాచి పాకిస్తాన్‌లోనే వున్నదని తాను అక్కడే 20 ఏళ్ల పాటుపెరిగానని అద్వానీ చెప్పారు. ఘజియాబాద్‌లో సిఐఎస్‌ఎఫ్‌ 33వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత్‌అప్పగించాల్సిందిగా కోరుతున్న టెర్రరిస్టుల నేర చరిత్ర యావత్‌ ప్రపంచానికి తెలుసునని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X