వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్‌, కిరొసిన్‌ పై మెత్తపడుతున్న సిన్హా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కోట్లాది మంది భారతీయుల నెలసరిబడ్జెట్‌ కు చిల్లు పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా తీసుకున్న నిర్ణయంపై వాజ్‌పేయి ప్రభుత్వం కాస్త మెతబడిన సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్‌ ధరను 40 రూపాయలు, కిరొసిన్‌ ధరను లీటర్‌ కు రూపాయిన్నర చొప్పున పెంచుతున్నట్లు యశ్వంత్‌ సిన్హా ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తంఅయింది. చివరకు అధికార బిజెపి పార్టీలో కూడా నిరసన వ్యక్తంఅయింది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు యశ్వంత్‌ సిన్హా ప్రధాని వాజ్‌పేయితో చర్చించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు.

పెంచిన ధరలను తగ్గించేది లేదంటూ సిన్హా కొద్దిరోజుల కిందట స్పష్టం చేశారు. అయితే ప్రధాని వాజ్‌పేయి సైతం ఈ విషయంలో పునరాలోచనలో వున్నట్లు పత్రికలురాశాయి. పెట్రోలియం శాఖ మంత్రి రాం నాయక్‌ కూడా శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో గ్యాస్‌, కిరోసిన్‌ ధరలు తగ్గించేవిషయంలో ప్రధాని సుముఖంగా వున్నట్లు ప్రకటించారు. దీనిపై యశ్వంత్‌ సిన్హా స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X