జయేంద్ర ఫార్ములకు ముస్లింబోర్డు నో
న్యూఢిల్లీః అయోధ్య వివాద పరిష్కారానికి కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేసిన ప్రతిపాదనలను ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. వివాదరహిత స్థలంలో రామాలయాన్ని నిర్మించుకొనేందుకు అనుమతించాలని, అందులో భాగంగా మార్చి 15న భూమి పూజ నిర్వహించుకొనేందుకు అనుమతించాలని జయేంద్ర సరస్వతిప్రతిపాదించారు. అయితే జయేంద్ర ప్రతివాదనలను అనుతించేందుకు తాము సిద్ధంగా లేమని ఆదివారం కొత్తఢిల్లీలో ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశంమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చి చెప్పింది.
అయోధ్య వ్యవహారంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొనే నిర్ణయాలు తమకు సమ్మతం కాదంటూ సమావేశ మందిరం వెలుపల పలు ముస్లిం సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. బాబ్రీమసీదునువిశ్వహిందూ పరిషత్ కు ధారదత్తం చేస్తే సహించేది లేదని వందలాది కార్యకర్తలు నినాదాలిచ్చారు.












Click it and Unblock the Notifications
