వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజ చేయడం హిందువుల మతహక్కు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలోని వివాద రహిత స్థలంలో మార్చి 15న భూమి పూజ నిర్వహించాలని విశ్వహందూ పరిషత్‌ దృఢసంకల్పంతో వుంది. వచ్చే శుక్రవారం నాడు అయోధ్యలో భూమి పూజను అనుమతించాలా వద్దా అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయిస్తామనే ప్రధాని వాజ్‌ పేయి ప్రకటనకు విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి ప్రవిణ్‌ తొగాడియా అభ్యంతరం చెప్పారు. ఏ స్థలంలో అయినా పూజచేసుకోవడం హిందువుల ధర్మం అని ఆయన అన్నారు.

హిందువులు పూజలు, యజ్ఞాలు,అర్చనలు, ఉపాసనలు చేసుకొనే హక్కును ఎవరూ కాదనలేరని ఆయన అన్నారు. పూజను అడ్డుకొనేందుకు ఎవరు ప్రయత్నించినా అది మతహక్కులకు భంగకరమే అని ఓ ప్రైవేట్‌ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొగాడియా అన్నారు. సుప్రీంకోర్టు వద్దని తీర్పునిచ్చినా అయోధ్యలో మార్చి 15న పూజ చేస్తారా అని ప్రశ్నించగా ఆ రోజున అయోధ్యలో పూజ జరుగుతుంది అంతవరకే నేను చెప్పగలనని తొగాడియా అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X