వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగివస్తేనే పాక్‌ తో చర్చలుః సుష్మా

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మానుకోవడంతో పాటు భారత్‌అప్పగించాల్సిందిగా కోరిన 20 మంది తీవ్రవాదుల్లో కనీసం 7 నుంచి 10 మందినైనాఅప్పగిస్తేనే పాక్‌ తో చర్చలు జరుపుతామని భారత్‌ స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వైఖరిని కనీసం 30 నుంచి 50 శాతం తగ్గించాలని, భారత్‌ కోరిన 20 మంది నేరగాళ్ళలో కనీసం 7 నుంచి 10 మందినిఅప్పగిస్తే పాక్‌ తో చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తామని భారత్‌ సమాచార ప్రసారశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాక్‌ పత్రిక ది న్యూస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

సార్‌ దేశాల సమాచార శాఖ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు సుష్మాస్వరాజ్‌ ఇస్లామాబాద్‌ వెళ్ళారు. మూడు రోజులుగా ఆమె పాకిస్తాన్‌ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారత్‌ - పాక్‌ ల మధ్య నేరగాళ్ళ మార్పిడిపై ఎటువంటి ఒప్పందం లేదనివిలేకరులు ప్రశ్నించగా మీ నుంచి స్పందన వస్తే ఒప్పందం ఎంతసేపని ఆమె సమాధానం ఇచ్చారు. గత ఏడాది ముషారఫ్‌ భారత్‌ పర్యటించిన సందర్భంగా నేరస్తుల మార్పుడి ఒప్పందానికి సుముఖత వ్యక్తం చేసినవిషయాన్ని గుర్తు చేశారు. నేరగాళ్ళను పాక్‌ కుఅప్పగించేందుకు భారత్‌ కు ఎటువంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు.

తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ముషారఫ్‌ కొన్ని చర్యలు తీసుకున్నవిషయాన్ని ప్రస్తావించగా కాశ్మీర్‌ లో జరుగుతున్న నరమేధాన్నిస్వాతంత్ర్య సంగ్రామంగా ముషారఫ్‌ అభివర్ణిస్తున్నప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటే మాత్రం ఏం లాభం అను శుష్మాస్వరాజ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X