వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వి.హెచ్‌.పి-పోలీసుల ఘర్షణలో ఇద్దరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌ కత్తాః యజ్ఞం నిర్వహించేవిషయంలో విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. కోల్‌ కతా లోని దక్షిణ 24పరగణాల జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నాలుగువేల మంది కరసేవకులు తాల్దిరైల్వే స్టేషన్‌ సమీపంలోని హరిష్‌ బాబా మందిర్‌ వద్ద యజ్ఞం, ధర్మసభను నిర్వహించేందుకు శనివారం రాత్రే గుమికూడారు. అయితే అక్కడ యజ్ఞం నిర్వహించేందుకు వి.హెచ్‌.పి. అనుమతి తీసుకోలేదు.

గుళ్ళో పూజ చేసుకొనేందుకు మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే ఒకరితరువాత ఒకరు మెల్లిగా గుడి లో గుమికూడడం ప్రారంభించారు. కొద్దిసేపటికి జైశ్రీరాం అంటూ నినాదాలివ్వడం ప్రారంభించారని పోలీసులు చెప్పారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. పోలీసులపై కరసేవకులు రాళ్ళురువ్వడం ప్రారంభించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. కొందరు పోలీసులతో సహా 12 మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన కరసేవకులురైల్వే ట్రాక్‌ పై ఫిష్‌ ప్లేట్లు తొలగించారు. దీంతో కొన్ని లోకల్‌రైళ్ళు రద్దుచేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X