వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు అద్వానీ తిరస్కృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌లో శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను పదవులకు రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి అద్వానీ తోసిపుచ్చారు. గుజరాత్‌ నరమేధంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను కూడా ఆయన తోసిపుచ్చారు.

గుజరాత్‌లో రాజ్యసభలో రెండు రోజుల పాటు సాగిన చర్చకు ఆయన సమాధనం ఇచ్చారు. గుజరాత్‌లో మతకల్లోలాలు చెలరేగిన సమయంలో ముఖ్యమంత్రి మోడి బాధ్యతారహితంగా రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశారని ప్రతిపక్ష సభ్యులువిమర్శించారు. ప్రధాని గుజరాత్‌లో పర్యటించే ఆలోచన కూడా చేయకపోవడాన్ని వారు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జుడీషియల్‌ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసిందని దోషులుగా తేలినవారు ఎంతటివారైనా వారిని కఠినంగా శిక్షిస్తామని అద్వానీ చెప్పారు. అద్వానీ ప్రకటన బాధ్యతా రహితంగా వున్నదని ఆరోపిస్తూ యావన్మంది ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు. నలుభై ఏళ్ల మచ్చలేని చరిత్ర వున్న బిజెపికి గుజరాత్‌ ఒక మాయని మచ్చగామిగిలిందని మిగిలిన పక్షాల కంటే తామే ఈ సంఘటనపట్ల తీవ్రంగా కలతచెందుతున్నామని అద్వానీ
చెప్పారు. పోలీసు కాల్పుల్లో మరణించినవారిలో అధికులు హిందూవులేనని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ఒక పద్దతి ప్రకారం దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 72 గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన మోడి సర్కారును ఆయన అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X