వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్‌లో బంద్‌ ప్రశాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

కానింగ్‌: విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) కార్యకర్తలపై పోలీసు కాల్పులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌ కానింగ్‌, తాల్దీహ్‌లలో తలపెట్టిన బంధ్‌ ప్రభావం సాధారణ జీన జీవితంపై పడింది.

శ్రీరామ యజ్ఞం కోసం తాల్దీహ్‌స్టేషన్‌ వద్ద గుమిగూడిన విహెచ్‌పి కార్యకర్తలపై పోలీసు కాల్పులు జరిపినందుకు నిరసనగా విహెచ్‌పి, బిజెపి సోమవారం బంద్‌ నిర్వహించాయి. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, 32 మంది గాయపడినవిషయం తెలిసిందే.

తాల్దీహ్‌లో పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ ప్రాంతంలో దుకాణాలను,విద్యా సంస్థలను మూసివేశారు. ట్రాఫిక్‌ స్తంభించింది.ఆందోళకారులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడంతో కానింగ్‌,సీల్దాహ్‌ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసు కాల్పులపనై న్యాయవిచారణకు ఆదేశించాలని విహెచ్‌పి డిమాండ్‌ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X