వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక జిల్లా ప్రణాళికా కమిటీలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జిల్లాల్లో ప్రణాళికా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలుల స్థానాల్లో జిల్లా ప్రణాళికా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు.

శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రణాళికా కమిటీలకు విస్తృతాధికారాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలుల (డిడిఆర్‌సిల) సమావేశాలు సక్రమంగా జరగడం లేదనిఅంటూ ఈ విషయమై ప్రభుత్వం సమీక్ష జరిపిందా అని కాంగ్రెస్‌ శాసనసభ్యుడుకె.ఆర్‌. సురేష్‌ రెడ్డి అడిగారు.

జిల్లా అభివృద్ధి సమీక్షా మండలులను పునర్వ్యస్థీకరించబోమని మంత్రి చెప్పారు.వీటి స్థానంలో ప్రణాళికా కమిటీలు త్వరలో ఏర్పాటవుతాయని,అందువల్ల డిడిఆర్‌సిలను పునర్వ్యస్థీకరించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X