క్రికెట్: భారత్ ఘనవిజయం
మొహాలీ:
జింబాబ్వేతో
ఆదివారంనాడిక్కడ
జరిగిన
రెండో
వన్డేలో
భారత్
64
పరుగుల
తేడాతోవిజయం
సాధించింది.
భారత్
సమష్టి
కృషితో
ఈవిజయాన్ని
సొంతం
చేసుకుంది.
ఫ్లడ్
లైట్ల
వెలుతురులో
సాగిన
ఈ
మ్యాచ్లో
మొదట
బ్యాటింగ్
చేసిన
భారత్
ఆరువికెట్లు
కోల్పోయి
319
పరుగుల
భారీ
స్కోర్
సాధించింది.
ఈ
లక్ష్యాన్ని
ఛేదించడానికి
ఆ
తర్వాత
రంగంలోకి
దిగిన
జింబాబ్వే
43.3
ఓవర్లలో
255
పరుగులకు
ఆలవుట్అయింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌరబ్ గంగూలీ, దినేష్ మోంగియా ధాటిగా బ్యాటింగ్ చేసి ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చేశారు. గంగూలీ 86 బంతుల్లో మూడుసిక్స్లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేయగా, మోంగియా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చినవి.వి.యస్. లక్ష్మణ్ 52 పరుగులు చేశాడు. ద్రావిడ్ 66 పరుగులతో నాటౌట్గా మిగిలాడు. దీంతో భారత్ 300 పరుగులను సునాయసంగా దాటింది.
భారత్ ఈ విజయం సాధించడంతో రెండు జట్లు చెరో మ్యాచ్ గెల్చుకుని 1-1తో ఉన్నాయి.