వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌: భారత్‌ ఘనవిజయం

By Staff
|
Google Oneindia TeluguNews

మొహాలీ: జింబాబ్వేతో ఆదివారంనాడిక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్‌ 64 పరుగుల తేడాతోవిజయం సాధించింది. భారత్‌ సమష్టి కృషితో ఈవిజయాన్ని సొంతం చేసుకుంది. ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఆరువికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ తర్వాత రంగంలోకి దిగిన జింబాబ్వే 43.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలవుట్‌అయింది.

మొదట ఆలిస్టర్‌ క్యాంప్‌బెల్‌ (62), ట్రావిస్‌ ఫ్రెండ్‌ (63) ధాటిగా బ్యాటింగ్‌ చేసి భారత్‌ గుండెల్లోరైళ్లు పరిగెత్తించారు. ఈ కీలక సమయంలో హర్బజన్‌ సింగ్‌ ఈ ఇద్దరినీపెవిలియన్‌ దారి పట్టించాడు. దీంతో జింబాబ్వేపై ఒత్తిడిపెరిగింది. హర్బజన్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు. దినేష్‌ మోంగియా 31 పరుగులు ఇచ్చి మూడువికెట్లు తీసుకుని భారత విజయానికి తోడ్పడ్డాడు.అగార్కర్‌ రెండు వికెట్లు, కుంబ్లే ఒక వికెట్‌ తీసుకున్నారు.

మొదట బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌరబ్‌ గంగూలీ, దినేష్‌ మోంగియా ధాటిగా బ్యాటింగ్‌ చేసి ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చేశారు. గంగూలీ 86 బంతుల్లో మూడుసిక్స్‌లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేయగా, మోంగియా 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చినవి.వి.యస్‌. లక్ష్మణ్‌ 52 పరుగులు చేశాడు. ద్రావిడ్‌ 66 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. దీంతో భారత్‌ 300 పరుగులను సునాయసంగా దాటింది.

భారత్‌ ఈ విజయం సాధించడంతో రెండు జట్లు చెరో మ్యాచ్‌ గెల్చుకుని 1-1తో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X