వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌ః వరంగల్‌ జిల్లాలో సోమవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌కు చెందిన ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. వరంగల్‌కు చెల్లిన ఎస్‌ఐ సంజీవ్‌ తీవ్రంగా గాయపడినట్టుగా తెలిసింది.ఎస్‌ఐ సంజీవ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.మరణించిన నక్సలైట్లలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నట్టుగా జిల్లా కేంద్రానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

వరంగల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో దేవాదుల వద్ద దట్టమైన అడువుల్లో ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం చత్తీస్‌గడ్‌ సరిహద్దులకు చాలా దగ్గరగా వున్నట్టు తెలిసింది. మహిళా దినోత్సవం సందర్భంగా నక్సలైట్లు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిసిన పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేశారనిఅంటున్నారు. వందమందిపైగా సాయుధ నక్సలైట్లు దాడి జరిపిన సమయంలో వున్నారని పోలీసులు కూడాపెద్దసంఖ్యలో వెళ్లి చుట్టుముట్టారని తెలిసింది. భీకరంగా జరిగిన ఎదురుకాల్పుల తర్వాత ఆరుగురు నక్సల్స్‌ మరణించగా తొమ్మిది ఆయుధాలు దొరికాయి. పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతున్నది
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X