వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై తెలుగుదేశం హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో మార్చి పదిహేనున విహెచ్‌పి తలపెట్టిన పూజాకార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి.

అయోధ్యలో యథాతథ స్థితిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఈ రెండు
పార్టీల నేతలు కోరారు. కోర్టు తీర్పు రాకుండా ప్రభుత్వంస్వాధీనం చేసుకున్న భూమిలో ఏ పక్షానికి ఏలాంటి కార్యక్రమం చేపట్టేందుకు అనుమతినిచ్చేది లేదని ప్రధాని లోక్‌సభలో ప్రకటించినప్పటికీ ఈవిషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగిపోలేదని టిడిపిపి నేత ఎర్రన్నాయుడు అన్నారు. హోం మంత్రి అద్వానీ జారీ చేసినట్టుగా చెబుతున్న ఆదేశాలు గందరగోళం సృష్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో యథాతథ స్థితిని కాపాడేవిషయంలో సందేహాలకు తావులేకుండా ప్రభుత్వం తన విధానాన్నివిస్పష్టంగా ప్రకటించాలని ఆయన కోరారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ కూడా దేశంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు అయోధ్యలో యథాతథ స్థితికి భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై వున్నదని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో రామసేవకులపై జరిగిన కాల్పులను ఆమె తీవ్రంగా ఖండించారు. సోమవారం నాడు లోక్‌సభలో అయోధ్యపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలోనే వాగ్యుద్ధం జరిగింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X