వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు తీర్పు శిరోధార్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః అయోధ్యకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి వుండాలని తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు సూచించారు. తాము మొదటినుంచి కూడా కోర్టు తీర్పే శిరోధార్యమని చెబుతూ వస్తున్నామని ఆయన చెప్పారు.

విహెచ్‌పి, ముస్లిం బోర్డు తదితర ఏ సంస్థలను తాముపేరుపెట్టి ప్రస్తావించడం లేదని సమస్యకు సంబంధించిన అన్ని పార్టీలు కోర్టు తీర్పుకు కట్టుబడి వుండాలన్నదే తమ డిమాండ్‌ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణవిషయంలో తమ ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తీర్పును అన్ని పార్టీలు విధిగా ఔదలదాల్చాలని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కోర్టు తీర్పే ఈ సమస్యకు పరిష్కారం కాగదని ఆయన అన్నారు. దేశంలోని ప్రధాన ముస్లిం సంస్థలు కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాయి. రాజ్యాంగంలోని లౌకికవిలువల పటిష్టతకు కోర్టు తీర్పు నిదర్శనమని ముస్లిం సంస్ధలుపేర్కొన్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X