వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూష కేసులో హైకోర్టు జోక్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన వర్ధమాన నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు జోక్యం చేసుకున్నది. మహిళా సంఘం నేత పుణ్యవతి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ మోతిలాల్‌ నాయక్‌ ప్రత్యూష కేసుకు సంబంధించిన పోస్టు మార్టం నివేదకను కోర్టుకు సమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు.

పోస్ట్‌మార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ను కూడా కోర్టులోహాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిపిన దర్యాప్తువివరాలను, కేసును ఎప్పటినుంచి సిబిఐకి అప్పగిస్తున్నదీ తదితరవివరాలను కూడా కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో నగర పోలీసు కమిషనర్‌, డిజిపి చేసిన పరస్పరవిరుద్దమైన ప్రకటనలను ప్రస్తావిస్తూ ఈ ప్రకటనలపై కోర్టుకు సోమవారం లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇద్దరు అధికారులను కోర్టు ఆదేశించింది. కేసులో హైకోర్టు జోక్యంపై ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉద్దేశ్యపూర్వకంగా ప్రత్యూష కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనిఅరోపిస్తూ బుధవారం నాడు నగరంలో పలు ప్రజాసంఘాలు ప్రదర్శన జరిపాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X