కేంద్రం వైఖరిపై మండిపడ్డవిపక్షం

న్యూఢిల్లీః అయోధ్యలో భూమి పూజకు అనుకూలంగా సుప్రీం కోర్టులో ప్రభుత్వం వాదించడం పట్ల బుధవారం నాడు లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ విషయంలో ప్రధాని వాజ్‌పేయి తక్షణమే సభలో ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యులు సృష్టించిన గందరగోళం వల్ల లోక్‌సభను సభాపతి రెండు సార్లు వాయిదా వేశారు. న్యాయశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేసేందుకు ప్రయత్నించినా విపక్షాలు పట్టించుకోలేదు. సభ మధ్యలోకి దూసుకువచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధాని మాత్రమే ప్రకటన చేయాలని వారు పట్టుబట్టారు. వాజ్‌పేయి ప్రభుత్వం యావత్‌ దేశాన్ని మోసం చేసిందని సమాజ్‌వాద్‌ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోపించారు. ముందుగా విపక్ష సభ్యులను మాట్లాడేందుకు అనుమతినిచ్చి ఆ తర్వాత ప్రధాని ప్రకటన చేయాలని లేదా ప్రధాని ప్రకటన చేసిన తర్వాతనైనా విపక్ష సభ్యులను మాట్లాడించాలని కాంగ్రెస్‌ నాయకుడు శివరాజ్‌ పాటిల్‌ డిమాండ్‌ చేశారు.

సభలో ఇంత గందరగోళం జరుగుతున్నా సభలోనే వున్న ప్రధాని వాజ్‌పేయి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.తొలుత సభ జీరో అవర్‌కు వాయిదా పడిన తర్వాత ప్రధాని వాజ్‌పేయి మంత్రి వర్గ సహచరులు అద్వానీ,అరుణ్‌ జైట్లీ, జస్వంత్‌సింగ్‌, ఉమా భారతి, సుష్మాస్వరాజ్‌, అనంత్‌ కుమార్‌ తదితరులతో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి అటార్నీ జనరల్‌ సొలీ సొరాబ్జీ కూడాహాజరయ్యారు. మెజార్టీ ప్రజల మనో భావాలను దృష్టిలో వుంచుకుని లాంఛన ప్రాయంగా పూజ చేసుకునేందుకు అనుమతినివ్వాలని వాజ్‌పేయి ప్రభుత్వం కోర్టును అభ్యర్ధించడం ప్రతిపక్షాల్లోనే కాకుండా మిత్రపక్షాల్లో కూడా ఆగ్రహాన్ని సృష్టించింది. అయితే ఈ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. మిత్ర పక్షాల నేతలతో కూడా ప్రధాని సమావేశమై వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+