వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మదాబాద్‌ లో హింస, కర్ఫ్యూ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః అయోధ్యలో శిలాదాన్‌ కార్యక్రమానికి మద్దతుగావిశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన రామ్‌ ధున్‌ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. దీంతో అహ్మదాబాద్‌ లో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కలుపూర్‌, కరంజ్‌, షాపూర్‌ పోలీస్టేషన్ల పరిధిలోవిశ్వహిందూ పరిషత్‌ చేపట్టిని రాం ధున్‌ కార్యక్రమం హింసారూపం తీసుకుంది. కోపోద్రిక్తులైన కరసేవకులు రాళ్ళురువ్వి విధ్వంసం సృష్టించారు. కరాంజి పోలీస్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించారు.మధ్యాహ్నం రాం ధున్‌ సందర్భంగా రాళ్ళురువ్వుకున్న సంఘటనలు జరిగాయి. ఒక ద్విచక్ర వాహనాన్ని దుండగులు తగలబెట్టారు. అహ్మదాబాద్‌ లోని నార్నాపురా క్రాస్‌ రోడ్‌ లో ఓ బస్సును తగలబెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపులో వున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X