వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరమహంతో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃవివాదాస్పద స్థలంలో శిలాదాన్‌ కు అనుతించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన రామజన్మభూమి శిలాన్యాస్‌ అధినేత రామచంద్ర పరమహంసతో ప్రధాని వాజ్‌పేయి ఫోన్‌ లో మాట్లాడారు. ప్రధాని వాజ్‌ పేయితో పాటు, కేంద్ర హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ, రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ లు పరమహంసతో మాట్లాడారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఎటువంటి అఘాయిత్యాలకు, ఆందోళనలకు పాల్పడవద్దని వారు పరమహంసను కోరినట్లు భావిస్తున్నారు.

ప్రస్తుత దశలో అయోధ్య వివాదాన్ని తట్టిలేపడం దేశానికి,ఎన్టీఏ ప్రభుత్వానికి, విశ్వహిందూ పరిషత్‌ ప్రతిష్ఠకు కూడా మంచిది కాదని ప్రధాని పరమహంసకు నచ్చచెప్పినట్లు భావిస్తున్నారు.

ప్రధాని వాజ్‌పేయి, అద్వానీల విజ్ఞప్తి మేరకే వివాదాస్పద స్థలం జోలికి పోరాదని పరమహంస నిర్ణయించుకున్నారనిఅంటున్నారు. మొత్తంమీద ఈ వ్యవహారం శాంతి యుతంగా పరిష్కారం కావడంతో దేశం యావత్తు హాయిగా ఊపిరిపీల్చుకుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X