వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో ఆంక్షల ఎత్తివేత: కతియార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్య: విశ్వ హిందూ పరిషత్‌ శిలాదాన్‌ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో భద్రతాపరమైన ఆంక్షలు ఎత్తేసేవిషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందని స్థానిక భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యుడు, భజరంగ దళ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడువినయ్‌ కతియార్‌ చెప్పారు. సాధ్యమైనంత త్వరగారైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు ఆయన తెలిపారు.

తాను ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితోనూ, హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీతోనూ మాట్లాడానని, భద్రతా ఆంక్షలను ఎత్తివేస్తామని,రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని వారు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

అయోధ్యలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంటోంది. గత పదిహేను రోజులుగా ఈ పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం చోటు చేసుకుంది. దుకాణాలను, వ్యాపార సంస్థలను తెరిచారు. ప్రజలు ఎప్పటిలా రోడ్లపైతిరుగుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X