వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని రెండు నాల్కల ధోరణి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంపై ప్రధాని వాజ్‌పేయి రెండు నాల్కల ధోరణి అవలంభించారని ఆరోపిస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శిలాదాన్‌కోసం ప్రత్యేక దూతను అయోధ్యకు పంపడం ద్వారా తన నిజరూపాన్ని ప్రధాని వాజ్‌పేయి బయటపెట్టుకున్నారని వారు ఆరోపించారు.

ఎన్‌డిఎ అజెండాకు కట్టుబడి వుంటామనిఒకవైపు హామీలమీద హామీలు గుప్పిస్తూనే మరోవైపు అయోధ్యవిషయంలో బిజెపి అజెండాను వాజ్‌పేయి అమలు చేస్తున్నారని మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ దుయ్యబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి డిమాండ్లను తీర్చడం తప్ప మరో మార్గాంతరం లేదన్నవిషయం వారిని కాదంటే పదవి పోవడం తథ్యమన్నవిషయం ఆయనకు బాగా తెలుసునని దేవేగౌడ ఎద్దేవా చేశారు. ప్రత్యేక దూతను అయోధ్య పంపడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో వాజ్‌పేయి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో మతోన్మాదులతో రాష్ట్ర ప్రభుత్వం
కూడా చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X