కోర్టు వెలుపల అయోధ్య పరిష్కారం
న్యూఢిల్లీః గుజరాత్, అయోద్య సంక్షోభాలను ప్రభుత్వం ఎదుర్కున్న తీరుపట్ల ప్రధాని వాజ్పేయి సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షోభాలను తాము విజయవంతంగా అధిగమించినట్టు ఆయన చెప్పారు. అయితే ఈ విజయం ఏ ఒక్కరి సొంతమూ కాదని ఆయన అన్నారు. గుజరాత్ హింసాకాండపై దర్యాప్తు జరిపేందుకు అఖిల పక్ష బృందాన్ని నియమిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. గుజరాత్ హింసాకాండను ఖండిస్తూ ఒక నేరం మరోనేరానికి సమర్ధింపు కాదని ఆయన స్పష్టం చేశారు. హింసాకాండ ఎలా ప్రారంభమైందని తర్జనభర్జనలు పడటానికి ఇది తగిన సమయం కాదని, బాధిత కుటుంబాలను ఆదుకోవడం తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
