వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై దేశంఘాటైన విసుర్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్యవిషయంలో తెలుగుదేశం పార్టీ వాజ్‌పేయి ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేసింది. ఇలా మీరు తప్పుడు విధానాలను ఎంచుకుంటూ పోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయి అని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడుసి. రామచంద్రయ్య శుక్రవారం రాజ్యసభలో వాజ్‌పేయి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మీకు మేం ప్రాణవాయువు అందజేస్తున్నాం.మీ నుంచి మంచి పనులు ఆశిస్తున్నాం అని ఆయన అన్నారు.

అయోధ్యను ఆయన అప్రధానమైనఅంశంగా ఆయన కొట్టిపారేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులనుఅంగీకరించాల్సిందిగా ప్రభుత్వం కొందరి ముందు మోకరిల్లుతోందని ఆయన సంఘ్‌పరివార్‌ను ప్రస్తావించకుండావిమర్శ చేశారు. కోట్లాది ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే అయోధ్యపై ఇంత గందరగోళం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అయోధ్యవివాదం అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రతిష్టను దిగజారుస్తోందని ఆయన అన్నారు. ఇలాంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వామ్య పక్షాలను సంప్రదించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటివిషయాల్లో ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం లేదా? మిత్రులనువిశ్వాసంలోకి తీసుకోరా అని ఆయన అడిగారు.

ప్రభుత్వ ఆర్థిక ఎజెండా, బడ్జెట్లపై కూడా ఆయనఘాటైన విమర్శలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితికిబడ్జెట్‌ అద్దం పట్టిందని ఆయన అన్నారు. తొమ్మిదో పంచ వర్ష ప్రణాళికలో నిర్దేశిత లక్ష్యాలనుచేరుకోలేకపోయామని ఆయన అన్నారు. ఉద్యోగలు సంఖ్య కుదింపు, పెట్టుబడుల ఉపసంహరణ వంటి చర్యలు తాత్కాలకి ప్రయోజనాలను మాత్రమే చేకూర్చి పెడతాయని ఆయన అన్నారు. సంస్కరణలను భారతీయీకరించాలని, వ్యవసాయ ఉత్పాదననుపెంచాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X