వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీ పడడం కాదు: ఆర్‌ఎస్‌ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః పదవోన్నతి కోసం రాజకీయంగా లాబీ నడిపే ప్రయత్నం చేసిన ఆరోపణలను ఎదుర్కుంటున్న వైమానిక దళం సీనియర్‌ అధికారి ఎయిర్‌ మార్షల్‌ మంజిత్‌ సింగ్‌ సెఖన్‌ తమ పదవికి రాజీనామా చేశారు. సర్వీసు నుంచి డిస్మిస్‌ అయ్యే ముప్పు వున్న విషయం గ్రహించిన సెఖన్‌ తానే ముందుగా రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. తిరువనంతపురం సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌గా వున్న సెఖన్‌ను గతవారమే ఆ పదవినుంచి తప్పించి ఢిల్లీలోని వైమానిక దళం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. వైమానిక దళం పశ్చిమ కమాండ్‌ చీఫ్‌గా నియామకం కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్‌ బాదల్‌తో పైరవీ చేయించారని ఆయనపై అభియోగం వుంది.

ఈ పైరవీకి సంబంధించినవివరాలు బయటకు పొక్కడంతో ఆయన పని ఇరకాటంలో పడింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన తనంత తానుగా రాజీనామా చేయడం లేదా డిస్మిస్‌కు సిద్ధపడటం మాత్రమేమిగిలి వున్నాయి. రాజీనామా చేయడానికి సెఖన్‌ మొదట మొరాయించడంతో వైమానిక దళం ప్రధానాధికారి చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ కృష్ణస్వామి ఆయన్నుసర్వీసునుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించారు. అయితే మధ్యలో మరికొందరుసెఖన్‌ శ్రేయోభిలాషులు జోక్యం చేసుకుని ఆయన్ను రాజీనామాకు ఒప్పించడానికి ప్రయత్నిస్తామని చెప్పడంతో ఆయన ఆగిపోయారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X