వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూష తల్లికి బెదిరింపులు

By Staff
|
Google Oneindia TeluguNews

(ఉండవల్లి పవన్‌ కుమార్‌)
హైదరాబాద్‌ఃనాకు గత రెండు రోజుల నుంచి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి, భయంగా ఉంది అని ప్రత్యూష తల్లి సరోజిని దట్స్‌ తెలుగు డాట్‌ కాం కి చెప్పారు. నా డిమాండ్స్‌ ఇతరమైనవి ఏవీ కావు. నా డాటర్‌ ని ఎవరు హత్య చేసిండ్రు. అది ఫస్ట్‌ బయటికి రావాలి. సెకండ్‌-వారికి కఠినమైన శిక్ష పడాలి, అంతే... అని ఆమె చెప్పారు.

ఈ రోజు హైకోర్టులో ప్రత్యూష కేసు వచ్చింది. ఏమైందో ఇంకా తెలీదు. హాస్పిటల్‌ లో రికార్డ్స్‌ అన్నీ డిజీపీస్వాధీనం చేసుకున్నారు. నిన్న హైకోర్టులో నేను అఫిడవిట్‌ దాఖలు చేశా. కేసు ఏ దశలో ఉందో ఇంకేం తెలీదు అని సరోజిని తెలిపారు. ఎక్కువసేపు మాట్లాడడానికి ఆమె ఆశక్తి చూపించలేదు. ఈస్వల్ప వ్యవథిలోనే ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.
అంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర్‌ రావు తోఅసెంబ్లీ గెస్ట్స్‌ హాల్‌ లో జరిగిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ రావు మాట్లాడుతూసరోజిని నల్గొండ జిల్లా బొమ్మల రామారంలో టీచర్‌. ఆమెకుథ్రెటెనింగ్‌ కాల్స్‌ వస్తున్నాయి. అవతలి వారు ఎవరో మాత్రం ఆమెకు తెలీదు. మేం కోరేది ఏంటంటే- ఆమెను భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌ కిట్రాన్స్‌ ఫర్‌ చేయాలి. ఇంటి వద్ద గార్డుని పెట్టాలి.సెక్యూరిటి ఏర్పాటు చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.అనంతరం సరోజిని అసెంబ్లీలోని తెలంగాణా రాష్ట్ర సమితి లెజిస్లేటివ్‌ పార్టీ కార్యాలయంలో దాదాపు గంటసేపు కూర్చున్నారు.పాఠకుల ప్రతిస్పందన
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X