ముస్లింలకుఆర్‌ఎస్‌ఎస్‌ఫత్వా

బెంగుళూర్‌:హిందువుల సుహృద్భావాన్ని పొందకపోతేముస్లింల భద్రతకు గ్యారంటీ వుండదనిరాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)హెచ్చరించింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలసుహృద్భావాన్ని పొందితేనే తమకు భద్రతఉంటుందన్న విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకుంటారని ఆశిద్దామనిఆర్‌ఎస్‌ఎస్‌ విధాన నిర్ణాయక విభాగం అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఎబిపిఎస్‌) ఆదివారం ఇక్కడి చన్నెనహళ్లిలో తీర్మానించింది.

మనసుహృద్భావాన్ని పొందితేనే ముస్లింలు క్షేమంగావుండగలుగుతారని ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ప్రధానకార్యదర్శి మదన్‌దాస్‌ విలేకరులసమావేశంలో అన్నారు. ముస్లింలు ఇంకా హిందువులనుఅవమానిస్తూ వెళ్లితే వారు హిందువులమనసు గెల్చుకోలేరని ఆయన అన్నారు. ముస్లింలుదేశంలోని చట్టాలను గౌరవించాలని, ఇప్పుడు వారు ఆ పనిచేయడం లేదని ఆయన అన్నారు. భారత్‌లోహిందువులను ముస్లింలు అవమానిస్తున్నారని,హిందువులను అవమానిస్తే సహించేదిలేదని ఆయన అన్నారు.

గోద్రా ఘటనను ఆర్‌ఎస్‌ఎస్‌ ఖండిస్తూ తీర్మానంచేసింది. అయితే ఆ ఘటన అనంతరం ప్రతీకారేచ్ఛసహజమైనదేనని అభిప్రాయపడింది. ప్రతీకారదాడుల్లో ఎక్కువ మంది మరణించడం దురదృష్టకరమనిఅన్నది. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను సొమ్ముచేసుకునేందుకు చర్య (గోద్రా ఘటన)నువదిలిపెట్టి ప్రతీకార చర్యలపై గగ్గోలుపెడతున్నాయని విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+