వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ మత ఉద్రిక్తతలు రేపుతోంది: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

గుర్గావ్‌: ప్రచ్ఛన్న యుద్ధంవిషయంలో అంతర్జాతీయంగా ఏకాకి అయిన తర్వాత పాకిస్థాన్‌ భారత్‌లో మత ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీవిమర్శించారు. పొటోను ఆయన సమర్థిస్తూ తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అటువంటి ప్రత్యేక చట్టాలు అవసరమని అన్నారు.సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) అధికారుల, జవాన్లనుద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు.

పొరుగు దేశం అన్నివిషయాల్లో ఓడిపోయిందని, అంతర్జాతీయ సమాజంలో క్రమంగా ఏకాకిఅయిందని ఆయన పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ఈ స్థితిలో గత నాలుగేళ్లుగా లేని మత ఉద్రిక్తతలను భారత్‌లో రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

తీవ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ వైఖరి మారే సూచనలు కనిపించడం లేదని, తమ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతనే పాకిస్థాన్‌ పట్ల భారత్‌ వైఖరి మారతుందని అద్వానీ
చెప్పారు.

భారత్‌ కోరిన 20 మంది తీవ్రవాదులను అప్పగించాలని అమెరికా పాకిస్థాన్‌కు సూచించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X