వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగూరు నీరు-మెదక్‌ కన్నీరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జంటనగరాల ప్రజల తాగునీటి అవసరాల కోసం మెదక్‌ జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు తెచ్చే యోచనను మెదక్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. మెదక్‌ జిల్లాలో అనేక గ్రామాలు తాగునీటి సమస్యతో ఫ్లోరిన్‌ సమస్యతో బాధపడుతున్నాయని ఆ గ్రామాలకు తాగడానికి నీళ్లు ఇవ్వకుండా వారి ముందునుంచే అక్కడి నీటిని జంటనగరాలకు తరలించడం ఎంతవరకు సబబని శనివారం అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు.

ఇప్పుటికే ఆరు టిఎంసిల నీరు సింగూరు నుంచి జంటనగరాలకు మళ్లిస్తున్నారని మరన్ని జలాల తరలింపునకు కూడా తమకు అభ్యంతరం లేదని అయితే స్థానిక గ్రామాల ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని వారుకోరారు. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఎమ్మెల్యేలు దీనికి తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తూ జంటనగరాల ప్రజలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేరని ఆవేశంగా అన్నారు. సింగూరు జలాల తరలింపును వారు గట్టిగా సమర్ధించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని మాట్లాడుతూ, సింగురు జలాలు స్థానికుల సమస్యలను కూడా తీర్చడం న్యాయమని అన్నారు. జంటనగరాలకు త్వరలోనే కృష్ణాజలలాను మళ్లిస్తున్నందున మెదక్‌ ప్రజల కష్టాలు కూడా గట్టెక్కుతాయని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X