నిష్పాక్షిక దర్యాప్తునకు ఆమ్నెస్టీవిజ్ఞప్తి
అహ్మదాబాద్: గుజరాత్లోని మత ఘర్షణలపై నిష్పాక్షికమైన దర్యాప్తు నిర్వహించాలని ప్రపంచ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. గోద్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన మత ఘర్షణల్లో 700 మందికి పైగా మరణించారు. 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
ప్రభుత్వం స్వేచ్ఛగా, క్షుణ్నంగా, సరిగా దర్యాప్తు చేయకపోతే హింసకు పాల్పడిన శక్తులు మళ్లీ మళ్లీ ఇదే హింసకు పాల్పడే ప్రమాదం ఉన్నదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హెచ్చరించింది.
చాలా హింసాత్మక సంఘటనలు పథకం ప్రకారం, సంఘటితంగా జరిగాయని ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టిఅర్థమవుతోందని, దాడులు చేసిన వారితో అధికారులు, పోలీసులు కుమ్మక్కయ్యినట్లు సమాచారం కూడా ఉన్నదని ఆ సంస్థ అన్నది.












Click it and Unblock the Notifications
