నల్లగొండ: గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నల్లగొండ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాదేశిక కమిటీ(ఎంపిటిసి) సభ్యుడి ఇంటిని పేల్చివేశారు. ఈ పేల్చివేతలో ఒక వ్యక్తి మరణించాడు.
చనిపోయిన వ్యక్తిని కూలీ పని చేసుకోవడానికి వచ్చిన గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన చుక్కపల్లి ప్రసాదరావుగా గుర్తించారు. ఈ సంఘటనలో ఎంపిటిసి సభ్యుడు బోడయ్య, ఆయన భార్య గాయపడ్డారు.పేల్చివేతలో బోడయ్య ఇల్లు రెండు గదులు ధ్వంసమయ్యాయి.