వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తు ద్రవంసేవించి 20 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని తూర్పు నగరంలో మత్తు కోసం వైద్య సంబంధమైన ద్రవం తాగి 20 మంది మరణించారు. విషపూరితమైన ద్రవం తాగి పంజాబ్‌ ప్రొవిన్స్‌లోని సాయిల్‌కోట జిల్లాలోవీరు మరణించారు. ఈ ద్రవాన్ని పేదలు సాధారణంగా మత్తు కోసం తాగుతూ వుంటారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

స్థానికంగా తయారైన ఈ మత్తు మందుసేవించి 20 మంది మరణించగా పలువురు ఆస్పత్రి పాలయ్యారని సాయిల్‌కోట పోలీసు అధికారి తారిక్‌ అబ్బాస్‌ చెప్పారు. మృతుల సంఖ్యపెరగవచ్చునని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారనే భయంతో కొన్ని కుటుంబాలు మరణాల గురించి తెలియజేయడం లేదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X