వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారా రాకతో విండీస్‌ జట్టులో ఉత్సాహం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ గుజరాత్‌లోఅగ్నికి ఆజ్యం పోస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. సబర్మతీ ఆశ్రమంలో నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేధా పట్కర్‌పై జరిగిన దాడిలో కాంగ్రెస్‌ పాత్ర కూడా ఉన్నదని ఆయన సోమవారం ఇక్కడవిలేకరుల సమావేశంలో అన్నారు.

మేధా పట్కర్‌పై దాడి చేసినవారిలో కాంగ్రెస్‌ అనుకూలురు ఉన్నారు, బిజెపి అనుకూలురూ ఉన్నారు. కాంగ్రెస్‌ వారిపేర్లు కూడా పత్రికల్లో వచ్చాయి అని ఆయన అన్నారు. దేశంలో ఏది జరిగినా సంఘ్‌ పరివార్‌ను వేలెత్తి చూపడం అలవాటయిందని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా మరింత జటిలం చేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆయనవిమర్శించారు.

గుజరాత్‌ అల్లర్లను కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని, ఉద్రిక్తతలను మరింతపెంచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కావాల్సింది సామరస్యమా, రాజకీయమా అని ఆయన కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అల్లర్లను అదుపు చేయడంలో గుజరాత్‌ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తోందని ఆయన కితాబు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X