వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌, భారత్‌ల మధ్య ఒప్పందాలు

By Staff
|
Google Oneindia TeluguNews

సింగపూర్‌: టెలికమ్‌, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి భారత్‌, సింగపూర్‌లు సోమవారం రెండు అవగాహనా పత్రాలపై సంతకాలు చేశాయి. దీర్ఘకాలిక సహకారానికి అవకాశాలు గల రంగాలను, ముఖ్యంగా వాణిజ్య ప్రోత్సాహంలో గుర్తించడానికి ఒక సంయక్త అధ్యయన గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలుఅంగీకరించాయి.

భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, సింగపూర్‌ ప్రభుత్వాధినేత గోహ్‌ చొక్‌ టొంగ్‌ సమక్షంలో భారత పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిఅరుణ్‌ శౌరి, సింగపూర్‌ సమాచార, కమ్యూనికేషన్ల, కళల యాక్టింగ్‌మినిస్టర్‌ డేవిడ్‌ లిమిన్‌ ఈ అవగాహనా పత్రాలపై సంతకాలు చేశారు. సంయుక్త అధ్యయన గ్రూప్‌లో వాణిజ్యవేత్తలు వుంటారు. ఈ గ్రూప్‌ ఏడాది లోగా తన సూచనలను రూపొందిస్తుంది.

ఆదివారంనాడిక్కడికి చేరుకున్న ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ఉగ్రవాద వ్యతిరేక పోరుపై, వాణిజ్య రంగంలో, నాలెడ్జి సంబంధిత పరిశ్రమల్లో సహకారంపై గోహ్‌తో విస్తృతంగా చర్చలు జరిపారు.

ఎయిర్‌ ఇండియాలో వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం లేదని అవగాహనా పత్రాలపై సంతకాలు చేసిన అనంతరంఅరుణ్‌ శౌరి విలేకరులతో చెప్పారు. సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌కు ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌లో 26 శాతం వాటా ఇచ్చే ఒప్పందం కుదరలేదని, ఆ విధంగా భారత్‌ గొప్ప అవకాశాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X