వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయెల్‌కు భారత్‌ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఐక్య రాజ్యసమితి: పాలిస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్‌ తక్షణమే వైదొలగాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. అమాయక పౌరులపై దాడులు మంచి పద్ధతి కాదని ఐక్య రాజ్యసమితిలో భారత డిప్యూటీశాశ్వత ప్రతినిధి ఎ. గోపీనాథన్‌ అన్నారు. పశ్చిమాసియాలో క్షీణిస్తున్న పరిస్థితిపై భద్రతా మండలి చర్చలో ఆయన పాలు పంచుకున్నారు.

భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని ఆయన ఇజ్రాయెల్‌, పాలస్తీనాలనుకోరారు. పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్‌ సేనలు వెంటనే వైదొలగాలని, కాల్పులవిరమణను పాటించి సంప్రదింపులు ప్రారంభించాలని ఆయన అన్నారు.

పాలస్తీనా నేత యస్సార్‌ అరాఫత్‌పై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని, దాని వల్ల ఆ ప్రాంతంలో తనసరైన పాత్రను పోషించగలరని ఆయన అన్నారు.

ఆరాఫత్‌కు మద్దతు, గౌరవం వున్నాయని, పాలస్తీనా జాతీయతకు ఆయన ప్రతీక అని గోపీనాథన్‌ అన్నారు. ఆరాఫత్‌ భద్రత గురించి, రక్షణ గురించి అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X