వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌డిఎ పక్షాల్లో గుజరాత్‌ చిచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్‌ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గుజరాత్‌లో కొనసాగుతున్న హింసాకాండ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాల్లో చిచ్చు రేపుతోంది.

నరేంద్ర మోడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని తాను చేసిన డిమాండ్‌ను తమ పార్టీ అధ్యక్షుడు కృష్ణారావు వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శంభు శ్రీవాస్తవ రాజీనామా చేశారు. పార్టీ వైఖరి మార్చుకోవడాన్ని నిరసిస్తూ ఆయన అధ్యక్షుడికి ఒక లేఖ కూడారాశారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని బర్తరఫ్‌ చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లోక్‌జనశక్తి డిమాండ్‌ చేసింది. గుజరాత్‌లో హింసకాండ కొనసాగుతుండడం పట్ల ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, ఈ పార్టీల డిమాండ్‌ను భారతీయ జనతా పార్టీ (బిజెపి) త్రోసిపుచ్చుతోంది. గుజరాత్‌విషయంలో భాగస్వామ్య పక్షాలు ఎన్‌డిఎ సమావేశంలో మాట్లాడాలని బిజెపి నేత సునీల్‌ శాస్త్రి అన్నారు. తనను ఎన్‌డిఎలో ఏకాకిని చేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యను బిజెపి త్రోసిపుచ్చింది. మమత అలా భావించాల్సిన అవసరం లేదని సునీల్‌ శాస్త్రి అన్నారు. ఏదైనా చెప్పదలుచుకుంటే మమతా బెనర్జీ ఎన్‌డిఎ సమావేశంలో చెప్పవచ్చునని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X