జమ్ము: గుర్తు తెలియనిమిలిటెంట్లు దోడా జిల్లాలోని నగ్ని దండా గ్రామంలో నలుగురిని హత్య చేశారు. హత్యకుగురైనవారిలో ఇద్దరు పిల్లలున్నారు. మరో నలుగురు పిల్లలు గాయపడ్డారు.
తాత్రి తాహిసిల్లోని గ్రామంలోకిమిలిటెంట్లు చొరబడి కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఇద్దరు పిల్లలతో పాటు నలుగురు మరణించారని అధికార ప్రతినిధి చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.