వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనారిటీ విద్యార్థులపరీక్షల బహిష్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో గురువారం ప్రారంభమైన రెండో విడత సెకండరీ, హయ్యర్‌ సెకండరీ పరీక్షలను దాదాపు 90 శాతం మంది మైనారిటీవిద్యార్థులు బహిష్కరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుజరాత్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు నిర్వహిస్తోంది.

గోద్రా ఊచకోత అనంతరం రాష్ట్రంలో మత హింస కొనసాగుతుండడంతో పరీక్షా కేంద్రాలను సురక్షిత కేంద్రాలకు మార్చాలనివిద్యార్థులు డిమాండ్‌ చేశారు. దీనికి అంగీకరించకపోవడంతో మైనారిటీవిద్యార్థులు పరీక్షలు బహిష్కరించారు. దాదాపు 14 వేల మంది మైనారిటీవిద్యార్థులు పరీక్షలను బహిష్కరించినట్లు గుజరాత్‌ రిలీఫ్‌ కమిటీ సభ్యుడు బద్రుద్దీన్‌షేక్‌ చెప్పారు.

అహ్మదాబాద్‌, బరోడాలతో పాటు తొమ్మిది నగరాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు లక్షా 90 వేల మందివిద్యార్థులు హాజరవుతున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ప్రభుత్వం వీడియో కెమెరాలను అమర్చింది. మైనారిటీవిద్యార్థులను సురక్షితంగా పరీక్షా కేంద్రాలకు చేరవేయడానికి కట్టుదిట్టమైన భద్రతతో బస్సులను ఏర్పాటు చేసింది.

ఎటువంటి ఉద్రిక్తతలకు లోనుకాకుండా పరీక్షలకుహాజరు కావాలని ముఖ్యమంత్రి నరేంద్ర మోడివిద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పరీక్షలను చెడగొట్టాలని ప్రయత్నం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X