తెలుగుదేశం మాతోనే వుంది: వాజ్‌పేయి

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)తోనే ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్‌ అబ్దుల్లా రాజీనామాను ఇంత వరకు ఆమోదించలేదని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటయిన కార్యక్రమంలో ఆయన బుధవారం ప్రసంగించారు.

లోక్‌సభలో బుధవారం తెల్లవారు జాము వరకు గుజరాత్‌అంశంపై జరిగిన చర్చ, ఓటింగ్‌ సంధర్భాల్లో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నా ఎన్డియే పక్షాలు చెక్కు చెదరకుండా నిలబడ్డాయని ఆయన కొనియాడారు. ముందు అనుకున్నట్లే ఓటింగ్‌లో నెగ్గామని ఆయన అన్నారు. మొత్తంమీద ఎన్డీయే నిలబడిందని ఆయన అన్నారు. ఒమర్‌ అబ్దుల్లారాజీనామాను తాను తీసుకోలేదని ఆయన చెప్పారు.

గాంధీయ గుజరాత్‌ను కొన్ని శక్తులు గాడ్సే గుజరాత్‌గా మారుస్తున్నాయని ప్రతిపక్ష నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యపై ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సున్నితమైన గుజరాత్‌అంశంపై జాతీయ ఏకాభిప్రాయం సాధించే తీరు ఇది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+