వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడలో పట్టపగలు బ్యాంక్‌ దోపిడి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడఃవిజయవాడలో పట్టపగలు బ్యాంక్‌ దోపిడి జరిగింది.విజయవాడలోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లో గురువారం సాయంత్రం ఇద్దరు దుండగులు ప్రవేశించి 60 వేల నగదు దోచుకువెళ్ళారు.

సమయానికి బ్యాంక్‌ వెలుపల వున్న వారుపెద్దగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. లేకపోతే లాకర్లలో ప్రవేశించి భారీ మొత్తంలో దోచుకొనేందుకు దుండగులు సిద్ధమయ్యారు. బ్యాంక్‌ మూసే సమయంలో ఇద్దరు దుండగులు ముసుగులు ధరించి బ్యాంక్‌ లోకి ప్రవేశించారు. బ్యాంక్‌ లోకి రాగానే క్యాషియర్‌ వద్దకు వెళ్లి మెడపై కత్తి వుంచి అతని క్యాష్‌ బాక్స్‌ లో వున్న 58 వేల రూపాయలు చేజిక్కించుకున్నారు. ఆ తరువాత లాకర్లు ఎక్కడ వున్నాయంటూ ప్రశ్నించారు. ఈ లోగా బ్యాంక్‌ సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా దొంగలు ఫోన్‌ కనెక్షన్‌ కట్‌ చేశారు.

బ్యాంక్‌ లో ఏదో జరగరానిది జరుగుతున్నదని గ్రహించిన బ్యాంక్‌ వెలుపల వున్న ప్రజలుపెద్దగా కేకలు వేయడం ప్రారంభించడంతో ముసుగుదొంగలు మోటర్‌ బైక్‌ పై పారిపోయారు. దొంగలిద్దరూ యువకులని, హిందీలో మాట్లాడారని బ్యాంక్‌ సిబ్బంది తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X