వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాధితుల సాక్ష్యమే కీలకం
హైదరాబాద్ః విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళే వారు దళారుల చేతుల్లో పడి మోసపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్ళేవారు బోగస్ సంస్థల చేతుల్లో పడి మోసపోతున్నారు. వారిని కాపాడడంతో పాటు మార్గదర్శకంగా వుండేందుకువీలుగా ఓవర్ సీస్ ఎంప్లాయ్ మెంట్ గైడింగ్ బ్యూరోని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్ మెంట్ఎక్స్చేంజ్ ల డైరక్టరేట్ ప్రతిపాదించింది. ఈ వినూత్న ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు ఎంప్లాయ్ మెంట్ఎక్స్చేంజ్ ల డైరక్టర్ వి. వెంకట్రామిరెడ్డి చెప్పారు.
Story first published: Monday, May 6, 2002, 23:53 [IST]