వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ తీవ్రవాద దాడి నీచం: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ సమీపంలోనిసైనిక శిబిరంపై దాడి సంఘటన అత్యంత నీచమైందని, ఇటువంటి సంఘటనలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. మిలిటెంట్లు జమ్మూ సమీపంలోని జాతీయ రహదారిపై 39 మందిని హత్య చేసిన సంఘటనపై ఆయన బుధవారం లోక్‌సభలో తీవ్రంగా ప్రతిస్పందించారు.

ఇటువంటి దారుణమైన సంఘటలను తిప్పికొట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. బుధవారం సభ సమావేశం కాగానే జమ్మూ సమీపంలోని సంఘటనపై ప్రతిపక్షాలు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికి వాజ్‌పేయి ప్రతిస్పందిస్తూ- ఇది పాక్షిక దృష్టితో లేవనెత్తాల్సినఅంశం కాదని, వాయిదా తీర్మానం ప్రసక్తే తలెత్తదని అన్నారు.

ఈ సంఘటనపై చర్చకు ప్రతిపక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని,అందువల్ల సభ్యులు ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయవద్దని ఆయన చెప్పారు.

ఈ సంఘటనపై మంగళవారం హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ ఒక ప్రకటన చేశారని, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ పరిస్థితినిఅంచనా వేయడానికి జమ్మూలో పర్యటిస్తున్నారని, ఫెర్నాండెజ్‌ గురువారం తిరిగి వస్తారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X