వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషార్రఫ్‌ హామీ నచ్చింది: ఆర్మిటేజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: భారత్‌తో యుద్ధాన్ని నివారించడానికి తాను కట్టుబడిఉన్నట్లు పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ హామీ ఇచ్చినట్లు అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రిజర్డ్‌ ఆర్మిటేజ్‌ చెప్పారు. భారత ఉపఖండం పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఇస్లామాబాద్‌ చేరుకున్నారు.

పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉన్నదని, అయితే భారత్‌తో యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తానని ముషార్రఫ్‌ ఇచ్చిన హామీ తనకెంతో నచ్చిందని ఆయనవిలేకరులతో అన్నారు. భారత్‌ కూడా ఇదే విధమైన హామీ ఇస్తుందన్నవిశ్వాసం ఉన్నదని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను నివారించడానికి అంతర్జాతీయ సమాజం సాధ్యమైనంత మేరకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్మిటేజ్‌ ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌తోనూ, విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్‌ సత్తార్‌తోనూ సమావేశమయ్యారు. ఆర్మిటేజ్‌ పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత రక్షణ మంత్రి డోనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ భారత ఉపఖండంలో పర్యటిస్తారు.
ఇస్లామిక్‌ మిలిటెంట్లు నియంత్రణ రేఖ వెంబడి భారత కాశ్మీర్‌లోకి చొరబడడం లేదని ముషార్రఫ్‌ తనకు చెప్పినట్లు ఆర్మిటేజ్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X